20 వేల కోట్ల సమీకరణకు యాక్షన్ ప్లాన్
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ మరోసారి సిద్ధమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కోకాపేట, మోకిలా, తొర్రూర్, బహదూర్పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భూములను ఆన్లైన్లో వేలం వేసింది. కోకారపేటలో రికార్డు స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు ధర పలికింది. అప్పట్లోనే తొర్రూర్లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్ఎండీఏ వెంచర్ వేసింది. అందులోని కొన్ని పాట్లు అమ్ముడుపోయాయి. బహదూర్పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికాయి. కానీ, తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలామంది చేతులు ఎత్తేశారు.
ప్రస్తుతం ఈ లే అవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు సిద్ధమవుతున్నది. దీనిపై సమగ్ర నివేదికను రెడీ చేసింది. కానీ, వీటిని ఇప్పుడే అమ్మాలా.. కొద్ది రోజులు ఆగాలా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం హెచ్ఎండీకు రూ. 20 కోట్లు అత్యవసరం. వాటి సమీకరణకు ఈ భూముల వేలం అనివార్యమవుతుంది. గతంలో వేలం వేసిన ఫ్లాట్లు అమ్ముడవక హెచ్ఎండీఏ విక్రయానికి నిరీక్షిస్తోంది. ఈ క్రమంలో భూములు, ప్లాట్ల ఆన్లైన్ వేలానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతోంది. ఈ మధ్యకాలంలో స్థిరాస్తి మార్కెట్లో ఏర్పడిన స్తబ్దత ప్రభావంతో వేలం నిర్వహిస్తే ఇబ్బందిగా మారుతుందని ఆచితూచి వ్యవహరిస్తున్నది. కానీ, నిధుల సమీకరణకు ఫ్లాట్లు వేలం వేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
అవసరం రూ. 20 వేల కోట్లు
ప్రస్తుతానికి హెచ్ఎండీఏకు పలు అభివృద్ధి పనులు చేయడానికి రూ.20 వేల కోట్ల వరకు అవసరం ఉంది. వీటి ప్రతిపాదనలన్నీ తయారు చేశారు. ఇటు, హెచ్ఎండీఏ పరిధిలో 1000 ఎకరాల పైనే భూములు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించారు. అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు సైతం రద్దయ్యాయి. ఇప్పుడు ఇలాంటి ప్లాట్లను 500 వరకు గుర్తించారు. ఈ ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయిస్తే సుమారు రూ.1000 కోట్లకు పైమాటే ఆదాయం సమకూరుతుంది. గతేడాది హెచ్ఎండీఏ భూములను ఆన్లైన్లో వేలం వేసింది. ఈ క్రమంలో కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు పలికింది. అలాగే బహదూర్పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు అమ్ముడవగా, తొర్రూర్లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లను సిద్ధం చేయగా, కొన్ని మాత్రమే అమ్ముడయ్యాయి. అలాగే మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లను వేలం వేయగా, భారీగానే ధర పలికింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం కాగా.. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైనే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి.
వాయిదాలకు చేతులెత్తేశారు
ఈ ఫ్లాట్లను దక్కించుకున్న వారు తొలి వాయిదా చెల్లింపు విషయానికి వచ్చేసరికి చాలా మంది చేతులు ఎత్తేశారు. అయితే, కోకాపేట తదితర ప్రాంతాల్లో భూములు రికార్డు ధర పలకటం వెనకు కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ప్రైవేటు భూములు ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ధరలు పెంచేందుకు ఆన్లైన్లో అధిక ధరకు కోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆయా ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల ఆన్లైన్ వేలానికి సంబంధించి ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్పై మార్కెట్లో నెలకొన్న కొంత స్తబ్దత ప్రభావం వేలంపై పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఎందుకంటే, ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములు ఉన్న కొందరు రియల్ వ్యాపారులు ఇప్పటికే ఉద్దేశపూర్వకంగానే రేట్లు పెంచారు. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులోకి ఉన్నాయంటే ఎంతలా రేట్లు పెంచారో అర్థం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఈ సమయంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఊపు వచ్చిన తర్వాత వేలం వేస్తే మంచి డిమాండ్ ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే వేలంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.