Tuesday, June 10, 2025

ఈసారి మా ప్రతీకారాన్ని ఊహించలేరు

పాకిస్తాన్ జోలికొస్తే సహించం : భారత్‌కు అహ్మద్ షరీఫ్ వార్నింగ్

ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వానికి సైతం భారతదేశం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న 9 ఉగ్రవాద కేంద్రాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. దీని తరువాత పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా భారత్ గట్టిగా బుద్ధి చెప్పడంతో ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు గంగలో కలిసింది. మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఈ సమయంలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారతదేశాన్ని హెచ్చరించారు. తమ వైపు కన్నెత్తి చూసినా, దాడులు చేసినా ఎదురుదాడి చేసి ఊహించని నష్టాన్ని కలిగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అహ్మద్ షరీఫ్ చౌదరి స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన కాల్పుల విరామం అంశంపై మాట్లాడుతూ, భారతదేశం నిబంధనలను ఉల్లంఘించి కాల్పులు, దాడులకు దిగితే.. అందుకు పాక్ నుంచి గట్టి సమాధానం వస్తుందని హెచ్చరించారు. “అమెరికా వంటి దేశాలు భారతదేశం ఏమి చేయాలనుకుంటోందో తెలుసు. ముందుగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాశ్మీర్ సమస్య, ఆ ప్రాంత ప్రజల సమస్యను ఐక్యరాజ్యసమితి ప్రకారం పరిష్కరించాలి.” అని వెల్లడించారు. “భారత్ కనుక మరోసారి మా సరిహద్దుల్లోకి ప్రవేశించి దేశ సమగ్రతతో చెలగాటం ఆడితే.. వారికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తాం. పాక్ ఇచ్చే సమాధానం చాలా కఠినంగా ఉంటుంది. పాక్ జోలికి, మా ప్రజల జోలికి భారత్ వస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈసారి మీరు ఉహించని రీతిలో సమాధానం ఉంటుంది.’ అన్నారు. షరీఫ్ చౌదరికి కంటే ముందు పలువురు పాక్ సైనిక అధికారులు భారతదేశానికి హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మీద అణుబాంబుతో దాడి చేస్తామని సైతం అన్నారు.

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భారత్
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకుంది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించగా.. పక్కా సమాచారం, ప్లానింగ్‌తో పాకిస్తాన్, పీఓకే లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడిచేసి నాశనం చేశాయి. భారత్ దాడులు నిజమేనని, అందులో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూసింది.

కాగా, తాము ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని, పాక్ తమకు శత్రువు కాదని, పాక్ సైన్యం, ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదని భారత ప్రభుత్వం, సైన్యాధికారులు స్పష్టం చేశారు. కానీ విచిత్రంగా పాక్ భారత్ లోని పలు నగరాలపై దాడులకు ప్రయత్నించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద అమాయక పౌరులపై కాల్పులు జరిపింది. సరిహద్దు నగరాలపై పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. అంతటితో ఆగకుండా పాక్ లోని కరాచీ, లాహోర్, రావల్ఫిండి సహాలు పలు నగరాలలో భారత సైన్యం దాడి చేసి ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరిగేలా చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com