తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్… 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలు టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది. గ్రూప్-1 ఫలితాలను టీజీపీయస్సీ tgpsc.gov.in వెబ్ సైట్ లో పెట్టారు.