Wednesday, August 28, 2024

పెళ్లికి వచ్చిన స్టార్‌ హీరోలకు అంబానీ విలువైన బహుమతి

అంగరంగ వైభవంగా అనంత్‌, రాధికా వివాహం వేడుక

ప్రపంచ కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ గ్రూపు అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబాని, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ ల కుమార్తె రాధికా మర్చంట్‌ ల పెళ్లి శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అట్టహాసంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి కోసం ముఖేశ్ అంబానీ సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చర్చ జరుగుతోంది. అనంత్, రాధికా వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

అసలు విషయం ఏంటంటే.. అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు ముఖేశ్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటీ యాభై లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

వివాహ వేడుకకు విచ్చేసిన కొంత మంది అతిథుల కోసం ముఖశ్ అంబానీ ఈ ఖరీదైన వాచీలను ప్రత్యేకంగా తయారు చేయించారట. బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి తారలు ఈ వాచీలతో ఫొటోలకు పోజులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వాచీల గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular