Friday, February 7, 2025

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

  • అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం
  • అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక
  • ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు

చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగిందిడొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం.. కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందేవీరంతా పంజాబ్‌‌దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోందిఅయితేవీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారంఅవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి

వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారురానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారుఅమెరికా హోంలాండ్‌ అధికారుల లెక్కల ప్రకారం.. 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు.. 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అం‌డ్‌ ‌రిమూవల్‌ ఆపరేషన్స్ ‌నిర్బంధంలో ఉన్నారుతొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారుఅక్రమవలసదారులపై ట్రంప్‌  ‌మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారుఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపుతరలింపు ప్రక్రియను వేగవంతం చేశారుఈ క్రమంలోనే ఎల్‌ ‌పాసోటెక్సాస్‌‌శాన్‌ ‌డియాగోకాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ ‌సిద్ధమైందిఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటేమాలాపెరుహోండూరస్‌ ‌తదితర దేశాలకు తరలించింది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com