Sunday, February 23, 2025

బాణామతి వస్తుందనే నెపంతో ఇంటి నుంచి వెళ్లగొట్టిన కుమారుడు, కోడలు, మనవళ్ళు

  • వీధిన పడిన వృద్ధ దంపతులు
  • విలేకరుల సమావేశంలో వెల్లడించిన వృద్ధ దంపతులు

సూర్యాపేట: బాణామతి వస్తుందనే నెపంతో కుమారుడు, కోడలు, మనవళ్లు ఇంటి నుంచి వెళ్లగొట్టిన వైనం ఆత్మకూర్ ఎస్ మండలం కందగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం సూర్యాపేట ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వృద్ధులైన భార్యాభర్తలు అర్రూరు నరసయ్య, భార్య అర్రూరు అనసూర్య మాట్లాడుతూ కందగట్ల గ్రామంలో వేరే నివాసం ఉంటున్నప్పటికీ ఇంటిలో ఉండొద్దని గత రాత్రి గృహనిర్బంధం చేసి భౌతికంగా కొట్టి మంగళవారం రాత్రివెల్లగొట్టారని కన్నీరు మున్నీరై విలపించారు.

తనకు ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ని కూడా కుమారుడే సేద్యం చేసుకుంటున్నాడని, గత మూడేళ్లుగా ఎలాంటి ధాన్యము, భుక్తము ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దమనుషుల సమక్షంలో సీజన్ కి ఐదు వేల రూపాయలు, పుట్టెడు వడ్లు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇవ్వడం లేదని వాపోయారు. పైగా భౌతికంగా, మానసికంగా క్షోభకు గురి చేస్తున్న కుమారుడు, కోడలు, మనుమల పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వేణుమాధవ్ కు వినతిపత్రం అందజేశారు .

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com