Friday, October 18, 2024

త్వరలో ఐఏఎస్‌లకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్

  • డీవోపీటీ ఆదేశాలతో ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు
  • ఏపీకి కేటాయించినా ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్‌లు
  • ఏపీకి వెళ్లాలంటూ ఇటీవల డీవోపీటీ ఆదేశాలు
  • క్యాట్ లోనూ, తెలంగాణ హైకోర్టులోనూ ఐఏఎస్ లకు నిరాశ
  • తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారులు

ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ కు రిపోర్టు చేసిన రొనాల్డ్‌రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ,వాణీ ప్రసాద్
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించినప్పటికీ తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు గురువారం ఏపీలో రిపోర్టు చేశారు. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్టు చేశారు. ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. క్యాట్ ను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తెలంగాణ హైకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. దాంతో డీవోపీటీ ఆదేశాలను పాటించక తప్పలేదు.

ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణలో పనిచేసిన నలుగురు ఐఏఎస్‌లు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి గురువారం వెళ్లారు. ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు ఐఏఎస్‌లు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. త్వరలో ఈ ఐఏఎస్‌లకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇవ్వనుంది. ఏపీకి వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఐఏఎస్‌లు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు బుధవారం కొట్టివేసింది. ఐఏఎస్‌లు వారికి కేటాయించిన స్థానాల్లో చేరాల్సిందేనని, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.

ఆలిండియా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు అన్నది పరిపాలనా పరమైన నిర్ణయమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది. అధికారులు వినతులను పరిశీలించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. మార్గదర్శకాలకు, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న వ్యక్తిగత వివాదాలకు చెందిన పిటిషన్లు ప్రస్తుతం క్యాట్లో ఉన్నాయని, ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడ చెప్పవచ్చంటూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ ఐఏఎస్‌లందరూ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఐఏఎస్‌లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలిని రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular