Sunday, October 6, 2024

అంబరాన్ని అంటిన జర్నలిస్ట్ ల దసరా సంబరాలు

  • అందరి జీవితాల్లో ఆనందం తీసుకు రావాలి
  • సాంసృతిక సంబరాలు సందడి
  • ఏపీ .వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు.

విశాఖపట్నం, అక్టోబర్ 6: విజయ దశమి పండుగ మనందరి జీవితాల్లో ఆనందం తీసుకు రావాలని విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ విశ్రాంతి లేని బిజీ జీవితం గడుపు తున్నారని వారికి, వారి కుటుంబాలకు పర్వ దినాల సందర్భంగా ఆహ్లాదం, ఆనందం కలిగించేందుకు ఇటువంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు దోహదము చేస్తాయన్నారు..

జర్నలిస్ట్ ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు..విమ్స్ లో జర్నలిస్ట్ లకు పూర్తి స్థాయీలో ఉచిత సేవలు నిరంతరం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిజి. ఆంజనేయులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు మాట్లాడుతూ విజయ దశమి పర్వదినంతో ప్రతీ ఒక్కరు మరింత ఉన్నతము గా ఉండాలి అని వీరు ఆకాంక్షి0చారు..జర్నలిస్టుల జీవితలక్ష్యం అయిన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలసి విన్నవించామన్నారు. అది త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా సిద్ధిస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలు పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో మంత్రులు ద్వారా జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంఘం నగర అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ దశరా సందర్భంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు ఘనంగా నిర్వహించు కోవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టుల అల్పాహారాలతో ప్రారంభమైన ఈ దశరా సంబరాల కార్యక్రమంలో ప్రదర్శించిన పలు సంగీత సాహిత్య నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో మధ్యలో పలు సార్లు లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి పలు బహుమతులను అందించారు.

ఆల్ఫాహోరంతో ప్రారంభం ఐన ఉత్సవాలు అధ్యంతరము సందడి నింపాయి..మధ్యాహ్నము విందు అనంతరం స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.మహిళలు అందరికి చీరలు పంపిణీ చేసారు., అర్బన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, జర్నలిస్టుల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, పితాని ప్రసాద్,ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులువై.. రామ కృష్ణ..ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్, కార్యదర్శి శ్రీనివాసరావు వివిధ కార్యవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular