Wednesday, September 18, 2024

అతిసారంతో ముగ్గురు మృత్యువాత పడడంపై స్పందించిన ప్రభుత్వం

అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న సిఎం

అమరావతి:- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసారం కారణంగా ముగ్గురు మృతిచెందారన్న సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.

ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించటం తో పాటు….అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. అతిసారం ప్రబలిన అభ్యుదయ కాలనీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular