Thursday, October 3, 2024

బాపుఘాట్ వద్ద గాంధీకి సిఎం ఘనంగా నివాళ్లు

గాంధీ జయంతిని (అక్టోబర్ 02వ తేదీని) పురస్కరించుకొని లంగర్‌హౌస్‌లోని మహాత్మాగాంధీ సమాధి బాపుఘాట్ దగ్గర సిఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణరావు మహాత్మా గాంధీ సమాధి దగ్గర పుష్పాలు ఉంచి ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

లాల్‌బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళ్లు అర్పించిన సిఎం
అంతకుముందు సిఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపి రఘువీర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular