Sunday, September 22, 2024

ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే సహించం

  • ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే సహించం
  • సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే చర్యలు
  • ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరిక

ఆర్టీసి కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష పడడంతో ట్విట్టర్ వేదికగా ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే టిఎస్ ఆర్టీసి యాజమాన్యం ఏమాత్రం సహించదన్నారు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గద్వాల డిపోకు చెందిన కండక్టర్‌పై జరిగిన దాడి కేసులో నిందితులిద్దరికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసి అధికారులకు టిఎస్ ఆర్టీసి యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

గద్వాల జిల్లాలో కండక్టర్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బి.కృష్ణయ్య అనే కండక్టర్ గద్వాల ఆర్టీసి డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు. 15 మార్చి 2015న అలంపూర్ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న బస్సులో డ్యూటీలో ఉన్నారు. అలంపూర్ వద్ద తాగిన మత్తులో చాకలి శ్రీనివాస్, గోపి బస్సు ఎక్కి డోర్ వద్దే నిల్చొని అసభ్యంగా ప్రవర్తించారు. బస్సెక్కే ప్రయాణికులను అసభ్యంగా తాకడం, ఉమ్మివేయడం వంటి వికృత పనులు చేస్తుండడంతో గమనించిన కండక్టర్ ఇద్దరిని మందలించారు. దాంతో కోపోద్రిక్తులైన ఇద్దరు కండక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలోనూ మళ్లీ అదే బస్సెక్కి కండక్టర్ విధులకు ఆటంకం కలిగించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో గద్వాల కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరిని దోలుషుగా తేల్చింది. ఇద్దరికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.500ల జరిమానా విధించింది. ఈ ఘటనపై ఆర్టీసి ఎండీ విసి సజ్జనార్ స్పందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular