Friday, April 18, 2025

మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందని, ప్రజా పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. ఏ ప్రభుత్వ పాలన పట్ల 100 శాతం మంది సంతోషంగా ఉంటారని తానేం కోరుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజమన్నారు. అయితే, తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని పేర్కొన్నారు.

మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం
కేబినెట్‌ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మల్లు భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో అల్పాహారం ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో తాము రాహుల్ గాంధీని కలవలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భట్టి చెప్పారు. వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని, ఏ ప్రభుత్వానికి కూడా ఇది సాధ్యం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించిన వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్‌లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని భట్టి విక్రమార్క వివరించారు.

మాదే అధికారిక తెలంగాణ తల్లి
తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని, అందుకే తెలంగాణ సహజత్వాన్ని ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని భట్టి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో రూ.64 వేల కోట్ల అసలు వడ్డీ కట్టామని తెలిపారు. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే రూ.64 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందనిమల్లు భట్టి విక్రమార్కతెలిపారు. తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని అన్నారు. పదేళ్ల తర్వాత హాస్టళ్లకు ఇచ్చే డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com