Thursday, May 29, 2025

భారత్‌లో మరోసారి కరోనా విజృంభణ

ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మరోసారి భారత్‌లో విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరింది. అదే సమయంలో తెలుగు రాష్ర్టాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ వందమందికి పైగా వైరస్‌ బాధితులను ఇంట్లో క్వారంటైన్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్‌మోగిస్తోంది. ఇక్కడ 430 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దానితో పాటు మహారాష్ర్టలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో పాటు ఢిల్లీ 104, గుజరాత్‌లో 83, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు, కర్ణాటకలో 57 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
గడచిన వారం రోజులుగా కరోనా చాపకిందనీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇక కరోనాతో దేశవ్యాప్తంగా కరోనాతో నలుగురు మరణించినట్లు వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు,, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ మూలంగా చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసినందున బయపడాల్సిన అవసరం లేదని, కాకపోతే అనారోగ్యంతో బాధపడే వారికి కరోనా తొందరగా ఎటాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com