దేశ వ్యాప్తంగా కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎఫ్ సి ఐ కాలనీ,నస్పూర్ మెర్పల్లి @ నేర్పల్లి సంతోష్ తండ్రి మారయ్య, మార్తాడి గ్రామం,బెజ్జుర్ మండలం, కొమురంభీమ్ ఆసిఫాబాద్,అను వ్యక్తి జూలై 1 న తన ఇంట్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అక్కడికి అక్కడే చనిపోయాడని మృతుని సోదరుడు మెర్పల్లి సదయ్య మార్తాడి గ్రామం,బెజ్జుర్ మండలం, కొమురంభీమ్ ఆసిఫాబాద్ అనునతని పిర్యాదు మేరకు 1జూలై నుంచి భారతదేశ కొత్త చట్టాలు అమలు కావడంతో సిసిసి నస్పూర్ ఎస్ఐ తులసి జితేందర్ సింగ్ సెక్షన్ 194 బి ఎన్ ఎస్ ఎస్ (భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టం) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చార్మినార్లో..
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై కొత్త చట్టంకింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ను డిజిటల్ గా నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్న నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని గుర్తించారు. వీరిలో ఒకరు గిల్ వర్కర్ కాగా, మరొకరు హోటల్ వర్కర్ వీరు ఇంటికివెళుతున్నారు. బీఎన్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశామని విచారణ జరుగుతుందని తెలిపారు. ఇంకా సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్టలో 194 సెక్షన్ కింద రెండు ఆత్మహత్యలు కేసులు నమోదు చేశారు. ఇవి గతంలో 174 సెక్షన్ పరిధిలోకి వస్తాయి.
అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇవే
150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారిపోయాయి. ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS అమల్లోకి వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ -CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS గా మారింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం వాడనున్నారు. ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు కానున్నాయి. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాల్సి ఉంది. 3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు. 24 గంటల్లోనే FIR నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి.
పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష. చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు. పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం సీసీటీన్స్. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానం.
డిజి లాకర్ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం. ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన. అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు. ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ. మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం. దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ. గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం. బాధితులకు, నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీ. పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్.