ఇండియా, పాకిస్తాన్ హై టెన్షన్ క్రమంలో.. దేశ వ్యాప్తంగా అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఉన్న భద్రత, ఇతర కీలక కంపెనీల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్న బీహెచ్ఈఎల్ కంపెనీకి కొత్త టైమింగ్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు నిరంతరం తెరిచే ఉంటే మెయిన్ గేట్లను.. ఇక నుంచి మూసివేస్తున్నారు. కంపెనీ చుట్టూ ఆరు గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి కంపెనీ ఉద్యోగులే కాకుండా.. స్థానిక ప్రజలు, ఇతరులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక నుంచి అలాంటి రాకపోకలపై ఆంక్షలు విధించింది బీహెచ్ఈఎల్.
ఈ బీహెచ్ఈఎల్ గేట్ల మూసివేత శుక్రవారం నుంచి అమలులోకి వస్తుంది. సెక్కూరిటీ కారణాల రీత్యా గేట్లు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. గేట్ల మూసివేత టైమింగ్స్ ఇలా ఉన్నాయి:
1. మెయిన్ చెక్ పోస్ట్: రాత్రి 11.30 నుంచి ఉదయం 5.00 గంటల వరకు మూసి వేయడం జరుగుతుంది.
2. శ్రీనివాస్ థియేటర్ గేట్: సెక్యూరిటీ కారణాలతో పూర్తిగా మూసివేయడం జరిగింది.
3. HIG (ZPHS) గేట్: ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది. 4. HIG (సుందరవనం పార్కు) గేట్: ఓపెన్ చేసి ఉంటుంది.
5.LIG గేట్ : ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది.
6. MAC సొసైటీ రోడ్ గేట్: పూర్తిగా మూసివేయబడింది.
7. CISF బరాక్ రోడ్ గేట్ : పూర్తిగా మూసివేయబడింది.
8. MIG (నెహ్రూ పార్క్ రోడ్ )గేట్ : ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది.
9. MIG (బుధవారం మార్కె్ట్ రోడ్ ) గేట్: పూర్తిగా మూసివేయబడింది.
అయితే, భారత్ పాక్ మధ్య తీవ్రతరం అవుతున్న యుద్ధ వాతావరణం రీత్యా గేట్లు మూసివేస్తున్నట్లు బీహెచ్ఈఎల్ ప్రకటించింది. అయితే అంబులెన్స్, ఫైర్ర సర్వీస్ వంటి ఎమర్జెన్సీ సేవలకు అనుమతి ఉంటుంది. లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఉద్యోగులు, నివాసం ఉంటున్న స్థానికులు ఈ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రకటన వెలువరించింది.