Sunday, April 20, 2025

ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న ఓ దినపత్రిక పై చర్యలు తీసుకోవాలి

ఈ వార్తపై విచారణ చేయాలని సిఎం, డిజిపిలను కోరిన భువనగిరి ఎంపి చామల

ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న ఓ దినపత్రిక పై చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. దిన పత్రికలో వచ్చిన వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియో విడుదల చేశారు. పండుగ రోజు కూడా ప్రభుత్వంపై ఓ పత్రిక విష ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ల్యాండ్ పూలింగ్ పేరుతో తన పేరు ప్రస్తావించకుండా ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన ఎంపి అని ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

అలాగే ఒక పేపర్ నడుపుతున్నప్పుడు ప్రామాణికతలు పాటించాలని ఆయన సూచించారు. దీనిపై విచారణ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి, డిజిపిలను ఎంపి చామల కోరారు. ప్రజలకు చిత్తశుద్ది ఉన్న పాలనను అందించాలని, రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ ని తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ది చేయాలని సంకల్పించారని ఎంపి తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులు గత పదేళ్లలో చేయని పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేస్తున్నందుకు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com