Monday, May 12, 2025

చంద్రబాబు సర్కార్ కు కోటి విరాళం ఇచ్చిన భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. 5 రూపాయల భోజనం అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఆగష్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. మొదటి విడతలో భాగంగా కొన్ని పట్టణాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అన్నక్యాంటీన్లకు సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఒక కోటి రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కున ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందజేశారు.

రాష్ట్రంలో నిరుపేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్లు చాలా గొప్ప కార్యక్రమమని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి చెప్పారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్నది తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ నినాదమని భువనేశ్వరి గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన అన్న క్యాంటీన్ కార్యక్రమానికి తన వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కోటి రూపాయల విరాళం అందించినట్లు భువనేశ్వరి తెలిపారు.

ఇక 5 రూపాయలకే ఆకలి తీర్చడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమన్న నారా భువనేశ్వరి.. పేదలకు, కార్మికులకు, రోజు కూలీలకు అన్న క్యాంటీన్లు ఆకలి తీరుస్తాయని చెప్పారు. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భువనేశ్వరి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com