-
బీఆర్ఎస్కు బిగ్ షాక్
-
గులాబీల్లో ‘పట్టభద్రుల’ చిచ్చు
-
రాకేశ్ రెడ్డిని బరిలో నిలపడంపై ఆగ్రహం
-
కీలక సమావేశానికి ముఖ్య నేతల డుమ్మా
వరంగల్– నల్గొండ– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన రాకేశ్రెడ్డికి టికెట్ ఇవ్వడంపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఈ టికెట్కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తే.. వారందరినీ కాదని రాకేశ్రెడ్డికి ఎందుకు ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహాక సమావేశాన్ని బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు గైర్హాజరయ్యారు. తాము రామంటూ తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో ఆందోళన నెలకొన్నది.
ఫోన్ చేసినా.. రాలే
ఈ సమావేశానికి మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 130 మంది నేతలకు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పంపింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు రావాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కూడా తెలంగాణ భవన్ నుంచి పలువురికి ఫోన్లు చేశారు. అయినప్పటికీ.. చాలా మంది రాలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ సహా ఎవరూ హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ ఫోన్ చేయగా.. ఆయన స్విచ్ఛాప్ చేశారు. ఆ తర్వాత వినయ్ భాస్కర్కు పదేపదే ఫోన్ చేయడంతో.. సమావేశం ముగుస్తుందనగా వచ్చారు. రాకేశ్రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అనుచరుగా పేరుండటం, పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని కాదని ఆయనకే టికెట్ ఇవ్వడంతో నేతలు అలిగారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రచారం చేస్తున్నా.. రాకేశ్రెడ్డి వెంట బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఉండటం లేదు.