ఇక డబుల్ ఇంజిన్ సర్కార్కు రంగం సిద్ధ్దం
ఆప్ను ఊడ్చి పారేసిన రాజధాని దిల్లీ వోటర్లు
పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్.. జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి
కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాల్కెంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బిజెపి అక్కడ అధికారం చేపట్టబోతోంది. అవినీతిని ఊడ్చేస్తానంటూ గద్దెనెక్కిన ఆప్ను ప్రజలు ఊడ్చి అవతల పడేశారు. ఈనెల 5న జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం వోట్ల లెక్కింపు జరిగింది. 70 సీట్లకు బిజెపి మ్యాజిక్ ఫిగర్ను దాటి 47 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్లో కనిపించాయి. కాంగ్రెస్ ఎక్కడా ఖాతా తెరవలేదు. పోటీ బిజెపి, ఆప్ మధ్యే జరిగినట్లు ఫలితాలు వెల్లడిరచాయి. మొత్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది. ఫలితాలపై బిజెపి హర్షం వ్యక్తం చేయగా, ప్రజల తీర్పును స్వాగతిస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇకపోతే ఫలితాల తీరును గమనిస్తే..ముఖ్యంగా దిలీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆప్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజీవ్రాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జ్కెన్, సోమనాథ్ భారతి వంటి కీలక నేతలు ఓడిపోయారు. లిక్కర్ స్కామ్లో జ్కెలుకెళ్లిన కేజీవ్రాల్, సిసోడియా, సత్యేందర్ జ్కెన్ ఓడిపోవడం గమనార్హం.
సాధారణంగా జ్కెలుకు వెళ్లి వొచ్చిన ఏ నాయకుడికైనా సానుభూతి వొస్తుంది, అయితే దిలీ వోటర్లు మాత్రం లిక్కర్ స్కామ్లో వీరి హస్తం ఉందని భావించినట్లు ఉన్నారు. అందుకే ముగ్గురిని కూడా చావుదెబ్బ తీశారు. తనను కావాలనే బీజేపీ టార్గెట్ చేస్తోందని కేజీవ్రాల్ పదేపదే ఆరోపించినప్పటికీ దిల్లీ వోటర్లు నమ్మలేదు. లిక్కర్ స్కామ్కి తోడు శీష్ మహల్, ప్రభుత్వ వ్యతిరేకత, మధ్య తరగతి వర్గాలు బీజేపీ వైపు వెళ్లడం.. ఇవన్నీ ఆప్ ఓటమికి కారణమని చెప్పవచ్చు. దిల్లీ లిక్కర్ స్కామ్ని విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఈ కేసులో ఆప్ నేతల్ని అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటకు వొచ్చిన కేజీవ్రాల్ తన పదవికి రాజీనామా చేసి, అతిశీ మార్లెనాకు దిలీ పగ్గాలు అప్పగించి, అనధికార సీఎంగా పనిచేశారనే వాదనలు ఉన్నాయి. అయితే, తన నిజాయితీని దిల్లీ ప్రజలు నమ్ముతారని, మళ్లీ తననే అధికారంలోకి తీసుకువస్తారని కేజీవ్రాల్ భావించారు. తన నిజాయితీకి అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం అని, తనను కాపాడే బాధ్యత దిల్లీ వోటర్లదే అని సెంటిమెంట్ కామెంట్స్ చేశారు.
అయినా కూడా జైలుకు వెళ్లి వొచ్చిన ముగ్గురు నేతలకు ఓటమి తప్పలేదు. ఇకపోతే కేజ్రీవాల్ను మాజీ సిఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడిరచి సంచలనం సృష్టించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ వోటర్లు బీజేపీకు పట్టం కట్టారు. కమలదళం హోరులో.. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకుపోయింది. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటి 48 స్థానాల్లో కమలం హవా కనబర్చింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు బీజేపీ గండికొట్టింది. అంతేకాదు.. ఆప్ అధినేత కేజీవ్రాల్ సహా పలువురు పార్టీ పెద్దలకూ ఓటమి తప్పలేదు. ఫలితాల్లో ఆప్ 19 చోట్ల విజయం సాధించింది. మరో 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా 22 స్థానాలకు పరిమితమైంది.
ప్రభావం చూపలేకపోయిన హస్తం పార్టీ
ఇక, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యం సాధించలేకపోయింది. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజీవ్రాల్ న్యూదిల్లీ స్థానం నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 4,089 వోట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇదే స్థానంలో పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్కు 4,568 వోట్లు రావడం గమనార్హం. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియా జంగ్పురాలో విజయం దక్కలేదు. తన సమీప బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో కేవలం 675 వోట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ.. కాల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఆది నుంచి వెనుకంజలో ఉన్న ఆమె చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకున్నారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 3,521 వోట్ల తేడాతో గెలుపొందారు. ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జ్కెన్ షాకూరి బస్తీలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ 20,998 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ నాయకురాలు శిఖా రాయ్ 3,188 వోట్ల తేడాతో నెగ్గారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత కైలాశ్ గెహ్లోత్ విజయం సాధించారు. తన సవిరీప ఆప్ అభ్యర్థి సురేందర్ భరద్వాజ్పై 9,833 వోట్లతో గెలుపొందారు. బీజేపీ నేత అర్విందర్ సింగ్ లవ్లీ గాంధీ నగర్లో విజయం సాధించారు. ఆప్ అభ్యర్థిపై 12,748 వోట్ల మెజార్టీతో నెగ్గారు.