జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో సెక్షన్ ఆఫీసర్ పై జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ కాకేష్ జైష్వాల్ శనివారం చేయి చేసుకున్నారు. ఒక విషయంలో ఇద్దరికి మాటామాటా పెరుగడంతో.. సెక్షన్ ఆఫీసర్పై దాడికి దిగాడు. ఉద్యోగులపై చేయి చేసుకోవడంతో జీహెచ్ఎంసీలో ఉద్యోగులు శనివారం మధ్యాహ్నం నుంచి విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒక ప్రభుత్వం అధికారిపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఏదైనా తేల్చాలంటూ సర్కిల్ 14కి తాళం వేసి ఉద్యోగులు అందరూ ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.