నేడు నవభారత నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ, భారత ప్రధానమంత్రి శ్రీ.నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని విజయవాడ భారతి నగర్, అన్అకాడెమీ కాలేజ్ నందు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు శ్రీ. వై సత్య కుమార్ గారు, మరియు బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాతూరి నాగభూషణం గారు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు, అలాగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ. అడ్డూరి శ్రీరాం గారు, బీజేపీ నాయకులు శ్రీ. లంకా దినకర్ గారు, విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ. పోతంశెట్టి నాగేశ్వరరావు గారు, కాలేజీ యాజమాన్యం కొమ్మినేని వెంకటేష్, గిరి, వంశీ తదితరులు హాజరయ్యారు. కాగా ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్.అచ్యుత బాబు గారు మరియు వారి వైద్య బృందం పాల్గొన్నారు.