హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, హెచ్ఎండిఏ డైరెక్టర్లు విద్యాదర్, శ్రీనివాస్, ఇన్చార్జీ సీఈ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ అధికారులు మాట్లాడుతూ బోనాల పండుగ ప్రకృతితో ముడిపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.
అంబేద్కర్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో….
డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో బోనాల పండుగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా.బిఆర్ అంబేద్కర్ ఉమెన్ అసోసియేషన్ ట్రెజరర్ నల్లపోచమ్మ టెంపుల్ కమిటీ లావణ్యలత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.