Sunday, June 1, 2025

Bonalu festival 2024: అంగరంగ వైభవంగా బోనాలు

  • ముఖ్యమైన దేవాలయాలకు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు
  • సమర్పించనున్న మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్

సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించే వారని ఈ సారి ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 శాతం అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీన దేవాలయాల వారీగా పట్టు వస్త్రాలను మంత్రులు సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 28వ తేదీన దేవాలయాల వారీగా పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రుల వివరాలు
శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క
శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ -మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ – మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి
శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్, కార్వాన్, మంత్రి దామోదర రాజనర్సింహ
శ్రీ మహంకాళి టెంపుల్, మిరాలం మండి, మంత్రి జూపల్లి కృష్ణారావు
నల్ల పోచమ్మ ఆలయం, సబ్జి మండి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
శ్రీ కట్ట మైసమ్మ ఆలయం, చిలకలగూడ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
శ్రీ ఖిలా మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ నగర్ సరూర్‌నగర్, మంత్రి దనసరి అనసూయ సీతక్క
శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయం, నాచారం ఉప్పల్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com