ఏ ప్రాతిపదికన పోటీకి దూరంగా ఉన్నారో చెప్పాలి
కిషన్ రెడ్డి విమర్శలు
నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడంలేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన డియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. కెసీఆర్కు తమ పార్టీ కార్పొరేటర్లపై నమ్మకం లేదని.. ఎమ్మెల్సీ ఎన్నికల వోటింగ్కు వెళ్లొద్దని వారికి చెబుతున్నార న్నారు. మజ్లిస్తో కాంగ్రెస్ కుమ్మకైందని ఆరోపించారు. ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయట పెట్టాలనే బీజేపీ పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్కు అండగా నిలబడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లను వోటు వేయకుండా బీఆర్ఎస్ బెదిరుస్తుందన్నారు.
అత్యధిక వోట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలోని కాకార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీ చేయకుండా మజ్లిస్కు అండగా నిలబడుతున్నాయి. ఎన్నికైన కార్పొరేటర్లను వోటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ బెదిరుస్తుంది. ఇది తమకు వోటు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే. ఎంఐఎం కోసం ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్కు వోటు వేయలేదు. బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు పోటీ చేస్తాయి. పచ్చి మతోన్మాద, రజాకారు మజ్లిస్కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయి. సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ రజాకర్ పార్టీ అవునా? కదా? రాహుల్ గాంధీ చెప్పాలి.
మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. 15 నిమిషాల సమయం ఇస్తే వందకోట్ల హిందువుల సంగతి చూస్తామన్న మజ్లిస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలి. బయట ఈ రెండు పార్టీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ ఓవైసీ దగ్గర వంగి వంగి సలాంలు కొడతారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన కేసీఆర్ పోటీ చేయడం లేదో చెప్పాలి. ఎవరిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్లను పిలిచి వోటు వేయొద్దని ఎందుకు బెదిరిస్తున్నారు. కు చీము నెత్తురు ఉంటే ఎంఐఎంకు బహిరంగంగా ఎందుకు వోటు వేయరు. బాస్ (ఒవైసీ)ను బుజగించేందుకు దూరంగా ఉండాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో డిపాజిట్ రాదని తెలిసినా పోటీ చేసింది.. ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. మజ్లిస్ పార్టీని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయడానికి ఈ రెండు పార్టీలు పోటీ పడుతాయి. ఇప్పటికే హైదారాబాద్ నగరంను ఎంఐఎంకు అప్పగించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.