ఈడీ ప్రకటన
మైనింగ్ పేరుతో రూ. 300 కోట్ల మేర అక్రమాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీ లాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ ఏక కాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోదాలు పూర్తి కావడంతో ఈడీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని.
రూ. 300 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తెలిపింది. ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చారని, బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీ లను గుర్తించామని తెలిపింది. అక్రమ మార్గంలో కూడ బెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని.
సోదాల సందర్భంగా రూ. 19 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. బినామీల పేర్లతో లావాదేవీ లను గుర్తించామని, కొన్ని బ్యాంక్ లాకర్స్ని ఇంకా తెరవాల్సి ఉందని తెలిపింది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి పలువురు బినామీ లుగా ఉన్నారని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది..