Monday, May 19, 2025

ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రిలో చేరారు. ఈమేరకు ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కవితకు ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీూక్షలు పూర్తవ్వనున్నట్లు సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కవిత. ఢిల్లీలో ఎయిమ్స్ లో గతంలో వైద్య పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెంట ఆమె భర్త అనిల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com