Monday, April 21, 2025

లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదు

  • లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదు
  • కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలో కనుమరుగు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎండాకాలం కరువుపై బిఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు దిగజారి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నారని, కానీ, బిఆర్‌ఎస్ కక్కుర్తికి కాళేశ్వరం కూలి పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువుకు కారణం కాంగ్రెస్ కాదని, బిఆర్‌ఎస్ కట్టిన ప్రాజెక్టులే కారణని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుతో ఇప్పుడు కరువు నుంచి తెలంగాణ బయట పడుతోందని ఆయన తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కినెట్టి తెలంగాణను అప్పులకుప్పగా చేసిందని ఆయన ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com