పేరుకే తెలుగమ్మాయి కానీ కెరీర్ మొత్తంలో ఎక్కువగా బాలీవుడ్లోనే ఎక్కువగా నటించింది శోభితధూళిపాళ. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ శోభితకు అనుకున్న స్థాయిలో స్టార్డమ్ మాత్రం దక్కలేదు. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శోభిత ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని రెడీ అవుతోంది. అందులో భాగంగానే శోభితకు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో శోభితకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్ సినిమాలో కథ, పాత్రలు, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంజిత్ కథలే కాదు, ఆయన డైరెక్షన్ కూడా ఇతరుల సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ చేస్తున్న సినిమా వెట్టువన్. దినేష్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాంటి పెద్ద సినిమాలో ఇప్పుడు శోభిత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు రాలేదు. పా .రంజిత్ సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికైనా మంచి గుర్తింపు దక్కుతుంది.అలాంటి రంజిత్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ వచ్చిందంటే శోభితకు ఇది బంపారఫర్ అనే చెప్పాలి.