Wednesday, April 9, 2025

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీజీపీఎస్సీ)గా ఐఏఎస్‌ అధికారి బుర్ర వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. ప్రభుత్వం పంపించిన పత్రాలపై సంతకం చేశారు. డిసెంబర్‌ 3వ తేదీతో ప్రస్తుత చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్‌ నియామకం పూర్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నది. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఆరు సంవత్సరాలు పాటు బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ పదవిలో ఉండనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులు కావడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు రాజీనామా బుర్ర వేంకటేశం రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఈయన వీఆర్‌ఎస్‌ అప్లయ్‌ చేయడంతో దానికి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబర్‌ 2వ తేదీన వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా నియమితులవడం వల్ల సంతోషంగా ఉందని బుర్రా వెంకటేశం మీడియాకు తెలిపారు.

1995 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి
బుర్రా వెంకటేశం జనగామ జిల్లాలో జన్మించారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అధికారి బుర్రా వెంకటేశం. రాష్ట్ర విభజన తరువాత ఆయనను తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1995లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. 2014లో ఏర్పాటైన ఏపీ పునర్వ్యవస్థీకరణ కమిటీలో ఆయన సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

వ్యవసాయం, ఉద్యానవనాలు, పౌర సరఫరాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కీలక శాఖలను చూస్తున్నారు. రాజ్‌భవన్ సెక్రటరీగా ఉండటంతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబర్‌ 3వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే టీజీపీఎస్సీ చైర్మన్‌ నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాగా, టీజీపీఎస్సీ చైర్మన్​ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నవంబర్ 20వ తేదీతో ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ.. ఈ దరఖాస్తులను పరిశీలించి బుర్రా వెంకటేశం పేరును ఖరారు చేసింది. నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ మరింత ఊపందుకోనుంది. అలాగే.. టీజీపీఎస్సీకి కొత్తగా 142 పోస్టులను క్రియేట్‌ చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల జీవో కూడా జారీ చేసింది. వీటిలో 73 పోస్టులను కొత్తగా రిక్రూట్‌ చేయనుండగా.. 58 పోస్టులను ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై ఫిల్ చేయనున్నారు. మిగతా 11 పోస్టులను పదోన్నలు ఇచ్చి నింపుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com