ఏఐ వీడియోలలు. ఫొటోలుపెట్టారని కేసులు
హెచ్సీయూ భూముల వివాదంలో ఏఐ వీడియోలు, ఫోటోలు పెట్టారని ప్రభుత్వం మరికొంతమంది కేసులు నమోదు చేసింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ కొణతం దిలీప్, బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్, థామస్ అగస్టీన్ పై కేసులు నమోదు చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కేటిఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, రవీనా టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా మరికొందరు ప్రముఖులపైనా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఏ ఐ ఫొటోలను తయారు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఐటీ టీమ్ సభ్యులను కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరితో పాటు హెచ్సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపైన ఎఫ్ఐఆర్ చేశారు. తాజాగా ఏఐ వీడియోలు తయారు చేశారని పలువురిపై కేసు నమోదు చేశారు.