కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర సాధికారిక కమిటీ విచారణ
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం జోక్యం చేసుకుంది. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర పర్యావరమ, అటవీ శాఖల సాధికార కమిటీ రాష్ట్రానికి వచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్తోపాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఈ కమిటీ.. వెంటనే విచారణ ప్రారంభించింది. ముందుగా నివేదికలన్నీ పరిశీలించింది. గురువారం మధ్యాహ్నం.
శుక్రవారం కంచ గచ్చిబౌలి భూముల్లో తిరిగి పరిశీలించనున్నారు. అక్కడ చుట్టూ స్థానికులతో పాటు విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు, వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్తో కూడా సమావేశం కానున్నారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దీనిపై వివాదం చెలరేగడంతో.. సుప్రీం కోర్టు సుమోటోగా కేసును తీసుకుంది. అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అక్కడ జరుగుతున్న పనులు ఆపాలని ఆదేశించడమే కాకుండా.. ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన పని స్టార్ట్ చేసింది.
ఈ నెల 3న సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద భూముల్లో చెట్లు నరికివేత, చదును చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. హైకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం కంచ గచ్చబౌలి భూముల్లో చెట్లు నరికివేసినట్టు తేలిందని ఇది చాలా సీరియస్ విషయమని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర నివేదిక కోసం కేంద్ర సాధికార కమిటీ పరిశీలన చేస్తుంది.