Sunday, September 29, 2024

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..

18 బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం.

న్యూఢిల్లీ: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబర్​ 4 నుంచి 22 వరకు కొనసాగ నున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్​, పుదుచ్చేరి లలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్​సభ సెక్రటేరియట్​ బులెటిన్​ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ లో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114 కు పెంచే బిల్లు పార్లమెంట్​ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్​ నుంచి వలస వెళ్లిన వారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్ట సభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతో పాటు 2023-24 కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్ల పై సమావేశాల్లో చర్చ, ఓటింగ్​ జరగనుంది. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు, సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్​ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular