Sunday, May 18, 2025

నేటి నుంచి సిపిసి టూర్‌కు శాసనసభ, శాసనమండలి బృందం

  • సిడ్నీకి వెళ్లనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్,
  • మండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే 67వ కామన్వెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ (సిపిసి)లో పాల్గొనడానికి నేటి నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బృందం అధికారికంగా విదేశీ పర్యటనకు వెళుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యుల నేడు రాత్రి (నవంబర్ 2, 2024) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిడ్నీకి బయలుదేరి వెళుతోంది. సిపిసి అనంతరం స్టడీ టూర్ లో భాగంగా న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో ఈ బృందం పర్యటించనుంది. అనంతరం నవంబర్ 16వ తేదీన తిరిగి ఈ బృందం హైదరాబాద్‌కు రానుంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com