సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి
జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి
డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలన్న సిఎం
మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలన్న సిఎం
వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం అదేశం
సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్ కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా
టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు:
• నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గింది. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయి.
• రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు….కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలి.
• పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలి. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడింది.
• ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయి. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పనిచేయాలి.
• వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించండి…దానికి అనుగుణంగా రెస్క్యూ ప్లాన్ చేయండి.
• వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుంది…ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి
• గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలి. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి.
• ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద కారణంగా పలు ప్రాంతాలు ముంపు భారిన పడ్డాయని తెలిపిన మంత్రి నారాయణ
• ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్న సిఎం
• నూజువీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని వివరించిన మంత్రి కొలుసు పార్థసారధి.
• ఇబ్బందుల్లో ఉన్న పలుప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంకు వివరించారు.
• వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు.
• వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలి…రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలి
• ప్రకాశం బ్యారేజ్ నుంచి సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అధికారుల అంచనా
• ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్
• బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలకు పంపాలి.
• ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికులకు సాయంపై వివరించిన జిల్లా కలెక్టర్, డీజీపీ.
• కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలి. మనం చేసే పనితో ప్రజల్లో సంతృత్తి కలగాలి. మనం మంచి చేసి సాయం అందిస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.
• పంటల అంచనాను తప్పకుండా వేయాలి. ఎక్కడా పెండింగ్ లో పెట్టకూడదు.
• డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలి. ఒక్క ఎకరా కూడా మిస్ అవ్వొద్దు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదు.
• దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలి.
• పనితీరు, వ్యవస్థలో లోపాటు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదు..మనమంతా ప్రజల కోసమే పని చేస్తున్నాం…వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు.
• ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుంది…ఆ దిశగానే మనం పని చేయాలని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
• ప్రజలు సహకరించాలని…..నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటాం.
• బాధ్యతలు అప్పగించిన అధికారులు విధులు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకుంటే చర్యలు తప్పవు…ప్రతి ఒక్కరికీ జవాబుదారీ తనం ఉండాలి.
• మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మనం వారికి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలి.