ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు.విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్.నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్.బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ.పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం.పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలన్న సీఎం.పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం.ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ఆహారం సమకూర్చిన ప్రభుత్వం.
ముంపు ప్రాంతాల్లో మరో సారి పర్యటనతో సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం.ఫలితాన్నిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్.సిఎం సూచనలతో, క్షేత్ర స్థాయి పర్యటనలతో వేగం గా కదిలిన యంత్రాంగం.నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టిన అధికారులు.ముంపు ప్రాంతాల్లో స్వయంగా సీఎం రాత్రంతా తిరగడంతో వేగం పుంజుకున్న సహాయక చర్యలు.వర్షంలోనే బోటు ఎక్కి బాధితుల వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి.అటు సీఎం సమీక్షలు… ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలతో వరద సాయం పనులు వేగవంతం… ముంపు ప్రాంతం లో కనిపిస్తున్న రిలీఫ్