Saturday, March 15, 2025

అన్ని కార్యక్రమాల్లో … ప్రభుత్వ భాగస్వామిగా ఉంటాం..

  • మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 
  • నైపుణ్యాభివృద్ధిపై సీఎం దార్శనికతకు కితాబు
  • సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపు ణ్యాభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.

నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్‌ 50 నగరాల్లో ఉంచ గలవని సత్య నాదెళ్ల అభిప్రా యపడ్డారు. హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్‌ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సత్య నాదెళ్లకు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ లోనూ మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ పెటు ్టబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ను టెక్నా లజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, జెన్‌  ఏఐ, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అను గుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ మద్దతుగా నిలవాలని ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రేడియల్‌ రోడ్లు, ఫ్యూచర్‌ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్ప నకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com