Saturday, May 31, 2025

భారత్‌పై చైనా మిసైళ్లు

చైనా తయారు చేసిచ్చిన పీఎల్-15 మిసైళ్లను భారత్‌పై ప్రయోగించినట్టు పాక్ ఎయిర్‌ఫోర్స్ శుక్రవారం అంగీకరించింది. పాక్ ప్రయోగించిన ఓ పీఎల్-15 మిసైల్ పలు కారణాలతో నిరుపయోగమై భారత భూభాగంలో పడింది. చివరకు భద్రతా దళాల కంట పడింది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది. పీఎల్-15 మిసైళ్ల పేరు చెబితే పాశ్చాత్య దేశాలు కూడా ఒకింత అప్రమత్తత ప్రదర్శిస్తాయి. అమెరికాను టార్గెట్ చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకున్న ఈ మిసైల్‌ను చైనా ఇప్పటివరకూ ఎక్కడా ప్రయోగించలేదు. దీని సామర్థ్యాల గురించి ప్రపంచ దేశాలు వినడమే కానీ దాని పనితీరు ప్రత్యక్షంగా పరిశీలించలేదు. ఈ నేపథ్యంలో భారత్‌కు లభించిన పీఎల్-15పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
గగనతల లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ మిసైల్ దీర్ఘశ్రేణి తరగతికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. దీని రేంజ్ 200 కిలోమీటర్లు ఉండొచ్చని సమాచారం. సామర్థ్యం పరంగా ఇది భారత్ వద్ద ఉన్న అస్త్ర మిసైల్‌తో సరిసమానమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఇటీవలే ఈ మిసైల్స్‌కు పాక్‌కు సరఫరా చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు ఈ మిసైల్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com