గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తీసుకోనుంది.ఈ మేరకు తాజాగా ఎయిర్ పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనం లోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్ఎఫ్ ఆధీనం లోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉపసంహరించాలని ఏఏఐ లేఖలో స్పష్టం చేసింది..