Saturday, October 5, 2024

టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం…

  • భక్తుల మనోభీష్టం మేరకు అత్యుత్తమ సేవలందిస్తాం
  • సీఎం నారా చంద్రబాబు నాయడు
  • రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళమాత వంటశాలను ప్రారంభించిన సీఎం

తిరుమల: శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని…భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ‘‘వకుళా మాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది.

1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చు. వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశాం. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీపడం. ముడిసరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు…దీనికి పేటెంట్ కూడా ఉంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉంది.’ అని అన్నారు.

భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు

‘టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం…రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటాం. గ్రీనరీ ప్రస్తుతం 72 శాతం ఉంది…దీన్ని 90 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. బయో డైవర్సిటీకి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. భక్తులకు దివ్య క్షేత్రంగా తిరుమల ఎప్పుడూ ఉంటుంది. భక్తల మనోభావాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుంది. శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. తిరుమలలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం. దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.

లడ్డు ప్రసాదంతో పాటు, అన్నప్రసాదం, ఇతర ప్రసాదాల్లో రాబోయే రోజుల్లో పరీక్షలు ఉంటాయి. నేను నిద్ర లేచిన సమయంలోనైనా, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరున్ని తలచుకుంటాను. తిరుమల కొండపై పని చేసేవారు, కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలి. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువు…ఆ ఎకో సిస్టం కాపాడతాం. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది…ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నాడు రెండు,మూడు వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత స్ట్రీమ్ లైన్ చేస్తాం. క్యూ మేనేజ్ మెంట్ కూడా సరిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్ మెంట్ లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారు.’’ అని సీఎం అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular