Wednesday, April 9, 2025

మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం

సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సిఎం సీరియస్
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం గోషామహల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ మతోన్మాద శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కొంతమంది హైదరాబాద్‌లో శాంతి లేకుండా అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలి, ఎంతో భావోద్వేగంతో పోలీసులు పని చేస్తున్నారని వెల్లడించారు. మతోన్మాద శక్తులను ఈ తరహా నేరగాళ్లను శిక్షించాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని ఆదేశిం చారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని వెల్ల డించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని వెల్లడించారు.

పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్
పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరు ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా, గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్‌శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు. పోలీస్ సమస్యలు ఏమున్నా తన దగ్గరికి తీసుకువస్తే తాను పరిష్కరిస్తానని వెల్లడించారు.

రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకం
140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారంటే అందుకు పోలీసులే కారణం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకం అని తెలిపారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావన్నారు. రాష్ట్రం అభివృద్ధికి పోలిసుల నిరంతరం శ్రమిస్తున్నందుకు పోలీసులకు అభినందనలు అన్నారు. తీవ్రవాదులు మావోయిస్టు చేతులో మరణించిన అధికారులను స్మరించుకోవడం అంద రికి స్ఫూర్తిదాయకమన్నారు. కొత్త కొత్త పంధాల్లో నేరాలు జరుగుతున్నాయని, అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుం దన్నారు.

నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం
‘తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్ ల్యాబ్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పదని కేంద్ర హోంశాఖ అభినందించింది. ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టి పీడిస్తోంది. నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. చదువుకున్నవారు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో విపత్కర పరిస్థితి ఎదుర్కోంటోంది. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ. డ్రగ్స్ వినియోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ విరివిగా రవాణా పెరిగిపోయిందని, యువకులను మత్తు వైపు ముఠాలు నడిపిస్తున్నాయి. డ్రగ్స్ అరికట్టేందుకు టిజి న్యాబ్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాం. డిజి స్థాయి అధికారిని నియమించాం. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఎప్పుడూ ముందుంటా’మని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ నార్కొటిక్ బ్యూరో అద్భుతంగా పనిచేస్తోంది
“ గత 10 ఏండ్లలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా విపరీతంగా పెరిగిందని, దానిని అరికట్టడంలో తెలంగాణ నార్కోటిక్ బ్యూర్ అద్భుతంగా పనిచేస్తోంది. మన పోలీసుల పని తీరు దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అందుకే పక్క రాష్ట్రాల పోలీసులు కూడా తెలంగాణకు వచ్చి శిక్షణ పొందుతూ వారి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. తీవ్రవాద, ఉగ్రవాద చర్యలను నియం త్రించడంతో మన రాష్ట్ర ఎస్‌ఐబి, గ్రేహోండ్స్, ఇతర పోలీసు విభాగాల నైపుణ్యాన్ని పక్క రాష్ట్రాల్లో కూడా ఫాలో అవుతున్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్ల్ ఆధారాంగా అనేక కేసులలో నిందితులు పట్టు బడ్డారు.” అంటూ సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.

అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ట్రాఫిక్ నియంత్రణ
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌ను ఉపయోగించాలని సూచించారు. దీని కోసం అవసర మయ్యే సాంకేతిక పరిజ్ఞానం, ఇతర సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతోనే ఉండాలి తప్ప క్రిమినల్స్‌తో కాదు
ఖద్దర్, ఖాకీల విధులను సమాజం ఎప్పుడు నిశితంగా గమనిస్తుందని, అందుకే వారందరీకి ఆదర్శంగా ఉండేలా మనం పని చేద్దామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రభుత్వం పోలీసులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని మాటిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతోనే ఉండాలి తప్ప క్రిమినల్స్ తో కాదని, తప్పు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాగే బాధితులకు సహానంతో, ఓపికతో సహకరించాలని సూచించారు.

పోలీసులకు తీపి కబురు అందచేసిన రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు వరాలు ప్రకటించారు. పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, రాష్ట్రం, దేశం కోసం వారు చేస్తున్న సేవలు మరువలేవని వెల్లడించారు. వారిని ప్రతి ఏటా సర్మించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్న రేవంత్ రెడ్డి పోలీస్ సంక్షేమానికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణించిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుండి కోటి రూపాయలు నష్ట పరిహారం అన్నారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తం అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్‌లకు కోటి 25 లక్షలు, డిఎస్ పి అడిషనల్ ఎస్‌పి, ఎస్‌పిలకు కోటి 50 లక్షలు, ఐపిఎస్ కుటుంబాలకు 2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాంక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తా మన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com