చల్లా శ్రీనివాసులు శెట్టికి అభినందనలు తెలిపిన సిఎం రేవంత్
భారత బ్యాంకింగ్ సెక్టార్లో దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులవుతున్న సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్బిఐ చైర్మన్ పదవిని అధిరోహించబోతుండటం ఒక మహత్తర సందర్భమని సిఎం అభినందనలు తెలిపారు.
ఈ మేరకు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. ఈ కొత్త బాధ్యతల్లో మరెన్నో విజయాలు, ప్రశంసలు అందుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆంక్షించారు. అలాగే శ్రీనివాస్ శెట్టికి వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్న శ్రీనివాసులు శెట్టి చైర్మన్గా ఆగష్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.