సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేటికి వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా అది నేటికి వాయిదా పడింది. ఢిల్లీలో ఆదివారం విపక్ష పార్టీలు సేవ్ డెమొక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహించడంతో పాటు రాంలీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో ఈ సీఈసీ సమావేశం వాయిదా పడింది.
దీంతో తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 ఎంపి స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంశంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. నేడు ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ రానుంది.