Saturday, September 14, 2024

సిఎం ఆదేశాలతో జనగామ బాలుడికి చికిత్సకు ఏర్పాట్లు

జనగామ జిల్లా బాలుడి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ బాలుడికి అవసరమైన నిధులు, చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను వైద్య శాఖ అధికారులు చేపట్టారు.

జనగామ జిల్లాకు చెందిన రెండున్నరేండ్ల బాలుడు మాధవన్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలుడి తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ బాలుడికి అవసరమైన శస్త్రచికిత్స, అందుకు అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్-, అలేఖ్య దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి, తక్షణ సాయానికి ఆదేశించింది.

ఆ మేరకు సంబంధిత అధికారులు బాలుడి తల్లిదండ్రు లను సంప్రదించి, వారి సమ్మతితో హైదరాబాద్ నిమ్స్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే నిధులను ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) ద్వారా అందించాలని నిర్ణయించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular