- ఇద్దరు నిందితుల అరెస్ట్
- అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు
- మంత్రి పొంగులేటి హెచ్చరిక
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి పర్స నల్ అసిస్టెంట్ ( పిఎ) ల మని చెప్పి అమా యకులను మోస గిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీ సులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేష్ .. హైదరాబాద్ నాగోల్లో నివాస ముంటున్నారు. వీరు మంత్రి పిఎలమంటూ రెవెన్యూ అది •కారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడు తున్నారు.
ఈ విషయాన్ని మంత్రి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీ సులు అక్రమ వసూళ్లకు పాల్ప డుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి తన పిఎలమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం కలిగినా సచివాలయంలోని తన కార్యాలయం 040- 23451072 / 040-2345 1073 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి ప్రజలకు సూచించారు. ఎవరైనా ఈ విధంగా అధికారాన్ని దుర్విని యో గపరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.