- పరిశ్రమలకు అనుకూలంగా రాష్ట్రం
- ఇస్వాయ్ ప్రతినిధులతో సీఎం రేవంత్
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఇస్వాయ్( ISWAI) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
క్రెడాయ్కు రండి… సీఎంకు ఆహ్వానం
ఆగస్టులో జరిగే క్రెడాయ్ ఈవెంట్ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని క్రెడాయ్ ప్రతినిధులు ఆహ్వానించారు. వచ్చే నెలలో క్రెడాయ్ రాష్ట్ర స్థాయి సదస్సు స్టాకన్-= 2024ను ప్రారంభించాలని కోరారు. ఈ ఈవెంట్ బిల్డర్ల సోదరభావానికి సంబంధించిన వివిధ సమస్యలను అన్ని వాటాదారుల సమక్షంలో పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 900 మంది డెవలపర్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. క్రెడాయ్ తెలంగాణ ఆఫీస్ బేరర్లు –మురళీకృష్ణారెడ్డి, ప్రేంసాగర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.