Wednesday, October 2, 2024

ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఏర్పాటుకు రండి

  • పాన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది
  • ఆర్టీసీలో ఇక నుంచి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే !
  • ప్రజా రవాణాలో జపాన్ బుల్లెట్ ట్రైన్స్ ప్రపంచానికే ఆదర్శం
  • జపాన్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • తోషిబా పరిశ్రమ సందర్శన
  • పెట్టుబడులకు, ఉమ్మడి భాగస్వామ్యానికి ఆహ్వానం

తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కూడా పెద్ద సంఖ్యలో కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలో ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, రాష్ట్రంలో సంబంధిత యూనిట్ లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని జపాన్​ కంపెనీలను కోరారు. జపాన్ దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క బుధవారం తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అదే విధంగా తోషిబా పరిశ్రమలను సందర్శించి, ఫ్యూయల్ సెల్ విభాగాలఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు మరియు నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సంబంధిత సేవలు తెలంగాణలో అవసరం ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో రావాలని సూచించారు.

తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని, దీనికి తోషిబా సేవలు అవసరమవుతాయన్నారు. అలాగే సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాల లోనికి ప్రవేశించనున్నదని, లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందుకు పోవచ్చని సూచించారు.

కాగా, తోషిబాప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టికి తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల సేవలను వివరించారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీ అయిన తోషిబా ఇప్పుడు పర్యావరణహిత సోలార్ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉందని వివరించారు. ముఖ్యంగా, సోలార్ విద్యుత్తులో వినియోగించే ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ, ఫ్యూయల్ సెల్ ,బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, శక్తివంతమైన జనరేటర్లు, జీరో కార్బన్ ఎమిషన్ టెక్నాలజీలను వృద్ధి చేశామని సంబంధిత వివరాలను తెలిపారు.

ప్రజా రవాణాలో జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచానికే ఆదర్శం
ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. టోక్యో నగరం నుంచి ఆయన బుల్లెట్ ట్రైన్ లోఒసాకా పట్టణానికి వెళ్లారు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ రైలుమార్గాన్ని కేవలం కేవలం 2 గంటల 20 నిమిషాలలో బుల్లెట్ ట్రైన్ ద్వారా చేరుకున్నారు. ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రైన్ లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి పరచడానికి పూనుకోవాలని రైల్వే శాఖను కోరనున్నట్లు భట్టి పేర్కొన్నారు.

తెలంగాణలో తోషిబాను మరింతగా విస్తరిస్తాం
ఈ సందర్భంగా తోషిబా బృందం మాట్లాడుతూ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే తమ యూనిట్లను ప్రారంభించామని, దీనిలో తెలంగాణ ప్రముఖమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉన్నందున స్వయంగా లేదా, రాష్ట్ర ప్రభుత్వంతో ఉమ్మడి భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఈవీ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని తోషిబా అధికారులు తెలిపారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular