Monday, March 10, 2025

పాలమూరు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా

టీఎస్​, న్యూస్​ :మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. రాష్ట్రంలో అమలులో ఉన్న సార్వత్రిక ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాల మేరకు నేడు జరగాల్సిన ఓట్ల లెక్కింపును అధికారులు జూన్ 2న వాయిదా వేశారు. ఫలితాలు వాయిదా వేయాలని ఈసీ ఆదేశించింది.

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో గత నెల 28న ఆ స్ధానానికి ఉప ఎన్నిక జరిగింది. 1439 మంది ప్రజాప్రతినిధులకు గాను 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఫలితంగా 99.86 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపును కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మంగా తీసుకోగా , కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి నవీన్‌ కుమార్‌ రెడ్డి భవితవ్యాన్ని ప్రజాప్రతినిధులు బ్యాలెట్‌ బాక్సులో నిక్షిప్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com