Thursday, October 3, 2024

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

  • దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను చేపట్టాలి
  • సిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం జరిగింది.

ఈ సమావేశంలో సిపిఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కె.రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 2.50 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విధానం రద్దు చేశారని వారు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను చేపట్టి ఉద్యోగుల విశ్వాసం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అశాస్త్రీయమైన విధానాన్ని రద్దు చేసి వారి వృద్ధాప్య జీవితానికి భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పెరి విజయ్ భాస్కర్, కోశాధికారిగా మారం లింగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా లెక్కల వీరేశం, మంగ నర్సింహులు, భూలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపెందర్, అసోసియేట్ అధ్యక్షులుగా శిరందాసు రామదాసు, సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి, శోభన్, శ్రీనివాస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular