బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రారంభమౌతున్నందున ఈరిలీజ్ డేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్ఫెక్ట్ టైం. వినోదాన్ని ఆస్వాదించాలనుకునే స్నేహితులకు ఈ మూవీ ఒక సరదా ప్రయాణంగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ వారి ముఖాలను రహస్యంగా కప్పి ఉంచిన రిలీజ్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతుంది.
విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉన్నందున, చిత్ర బృందం ప్రమోషనల్ యాక్టివిటీస్ ని వేగవంతం చేస్తోంది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. ఉతుర ఎడిటింగ్ విధులను నిర్వహిస్తున్నారు.