Sunday, September 29, 2024

యూట్యూబ్ లో చూసి భార్యను కడతేర్చిన CRPF జవాన్

కట్టుకున్న భార్యపై అనుమానంతో పెళ్లయిన మూడు నెలలకే పథకం ప్రకారం హతమార్చాడో దుర్మార్గుడు. పైగా ఆ నేరం వేరొకరిపై మోపేందుకు ప్రయత్నించిన సదరు సీఆర్పీఎఫ్ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా బంగారమ్మపేట గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (22)ను జూన్ 16న రాత్రి 11 గంటల సమయంలో భర్త నక్కా జగదీష్(30) నైలాన్ తాడు మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత గతంలో ఉన్న పరిచయాలతో ప్రసాద్ వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానని ఆమె మొబైల్ ఫోన్ నుంచి అనూష తండ్రి, అన్న, స్నేహితురాలు, భర్త (తనకు)కు వాట్సాప్ ద్వార మెస్సేజ్ లు పంపించాడు.

ఇంకేముంది కోపోద్రేకానికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడికి వెళ్లారు. వారు పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే ఎస్ఐ మహేశ్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. ఇంటికి కొంత దూరంలో పశువులపాక వద్ద అనూష మృతదేహం పడి ఉంది. వెంటనే పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు అనూష కు, ప్రసాద్ కు మధ్య గత సంవత్సర కాలంగా ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు లేవని పోలీసులు గుర్తించారు.

వెంటనే మృతురాలు అనూష పంపిన మెసేజ్ లు ఓకేసారి నలుగురికి ఎలా వెళ్లాయనే కోణంలో విచారణ చేపట్టారు. అనుమానం వచ్చి ఆమె భర్త జగదీశ్ ను తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇంట్లో వాళ్లు తనకు ఇష్టం లేకుండానే బలవంతంగా పెళ్లి చేయడంతో కొన్ని రోజులకే అనూషను పుట్టింట్లోనే వదిలి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో భార్యను హత్య చేయడానికి వారం రోజుల క్రితం ఊరికి వచ్చాడు. ఈనెల 16న రాత్రి బంగారమ్మపేట గ్రామానికి వచ్చి.. భార్యను ఇంట్లోంచి బయటకు రమ్మని పిలిచాడు. ఆమె ప్రవర్తనపై ప్రశ్నించగా.. ఆమె భయంతో కేకలు వేయగా.. అప్పటికే జేబులో ఉన్న నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అప్పటికే ఫోన్ లో సిద్ధం చేసిన మెస్సేజ్ ను ఆమె ఫోన్లోకి కాపీ పేస్టు చేసి నలుగురికి ఓకేసారి ఫార్వర్డ్ చేశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular